నాటుసారాతో పట్టుబడిన వ్యక్తులను బైండొవర్ చేసిన
ఎక్సైజ్ ఎస్ ఐ సాయి కుమార్
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తరం మండలంలో గతంలో నాటు సారాయి కేసులలో పట్టుబడిన పారుపల్లి లక్కారం మచ్చుపేట ఖమ్మం పల్లి అడవి శ్రీరాంపూర్ గ్రామాలలోని వ్యక్తులను ఇకమీదట నాటు సారాయి అమ్మకుండా ఉండటానికి ఒక సంవత్సర కాలం పాటు ఒక లక్ష రూపాయల జరిమానతో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి దగ్గర బైండోవర్ చేయడం జరిగిందని ఎక్సైజ్ ఎస్ ఐ సాయి కుమార్ తెలిపారు ఈ కార్యక్రమం లో ఎక్సైజ్ సిబ్బంది నిరంజన్ శ్రీనివాస్ రవి పాల్గొన్నారు