గ్రామాల అభివృద్ధి చేశాం బిల్లులు విడుదల చేయాలి.

Bills Bills

గ్రామాల అభివృద్ధి చేశాం… బిల్లులు విడుదల చేయాలి.

◆- అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల్ తాజా మాజీ మండల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. 50 సంవత్సరాలలో జరుగని అభివృద్ధి గత ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో జరిగి దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్న ఒక్క బిల్లు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామాల అభివృద్ధికి అప్పులు తెచ్చి పనులు చేసామన్నారు. పనులకు సంబందించిన బిల్లులు రాకపోవడంతో కొందరు మాజీ సర్పంచ్లు తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సీఎం రేవంత్రెడ్డికి చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాజీ సర్పంచ్లను ఆదుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!