బైక్ దొంగను పట్టుకున్న పరకాల పోలీసులు
పరకాల,నేటిధాత్రి
శనివారం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ఎస్సై పవన్ కుమార్ వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా పట్టణానికి చెందిన మంద అరవింద్ అనే వ్యక్తి హోండా స్పెండర్( టీఎస్ 03 ఈఎఫ్ 8733 నెంబర్ గల వాహనం మీద అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని పట్టుకొని విచారించగా అతను తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో బైక్ను దొంగలించినట్టు ఒప్పుకున్నాడు.అనంతరం పోలీసులు అరవింద్ పై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్టు తెలిపారు.దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ పవన్,సిబ్బందిని ఏసిపి సతీష్ బాబు మరియు సిఐ క్రాంతికుమార్ అభినందించారు.
