కోట గుళ్ళు దేవాలయంలో భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ గౌడ్ పూజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో శనివారం భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, శ్రీ భవాని సహిత గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సీఐ నరేష్ కుమార్ గౌడ్ ను ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.