గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు ఏ ఎస్ ఆర్ గార్డెన్ (కుందురు పల్లి ) నందు నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశానికిభూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలోనిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ,వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య,ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శాసనసభ్యులందరు భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి
పాల్గొంటారు.కావున కాంగ్రెస్ పార్టీ గణపురం మండలంలోని ప్రజా ప్రతినిధులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు ,బూత్ ఎన్ రోలర్స్ మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ కోరారు