ముదిగుంట గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సు.

ముదిగుంట గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సు

జైపూర్ నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సును మంగళవారం అధికారుల సమక్షంలో నిర్వహించారు.భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాపు జతపరచాలని భూభారతి చట్టంలో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తూ 6 వేల మంది సర్వేయర్లను నియమించి ప్రజల భూ సమస్యలను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సంతోష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి, ఎంపీఓ తిరుపతి బాపూరావు, ఎస్సై జాడి శ్రీధర్, పంచాయతీ సెక్రెటరీ సురేష్ ఇతర సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version