సామాన్యుడి హక్కుల పరిరక్షణకే భూభారతి.
భూ భారతి చట్టం రైతుల చుట్టం అవగాహన సదస్సు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలoలో గల రైతు వేదిక భూ భారతి చట్టం రైతుల చుట్టం అవగాహన సదస్సు గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను సరిచేసి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేయడం జరిగిందని అన్నారు.

భూ భారతి అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరైన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లా డుతూ పది సంవత్సరాలు గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల నష్టపోయిన లక్షలాది మంది విజ్ఞప్తుల మేర కు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ధరణి పోర్టర్ ను తొలగించి భూభార తి చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు.

మార్పులుచేర్పులకు గతంలో అవకాశం లేదని ప్రస్తుత చట్టంలో రెవెన్యూ అధికారులకు అన్ని అనుమతులు ఇవ్వడం వల్ల రైతులకు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. చట్టంలో తీసుకు వచ్చిన మార్పులను స్థాయిలో రైతులకు వివరించి రైతులను చైతన్యం చేయాలని కోరారు అధికారులు తప్పు చేస్తే సహించేది లేదన్నారు.

భూ సమస్యలపట్ల ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, మండల ఎమ్మా ర్వో సత్యనారాయణ ఎంపీడీవో ఫణి చంద్ర, ఆర్ ఐ, వ్యవసా య అధికారులు, చిoదం రవి, మార్కండేయ, బాసని శాంత- రవి , బాసని చంద్రప్రకాష్, మారపేల్లి రవీందర్, కట్టయ్య రాజేందర్, దుబాసి కృష్ణ మూర్తి, వలి ఐదర్, చింతల రవిపాల్, వైనాల కుమార స్వామి, అబ్బు ప్రకాష్ రెడ్డి, తిరుపతి, రాజిరెడ్డి, మోత్కూరి భాస్కర్, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అభిమా నులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికా రులు పాల్గొన్నారు.