కామారెడ్డిపల్లి గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు
పరకాల నేటిధాత్రి
శుక్రవారం రోజున మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సునుఎమ్మార్వో విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని,ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.రైతులు,ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ రెడ్డి,సర్వేయర్ విజయ్ కుమార్,రేవన్యూ సిబ్బంది పాల్గొన్నారు.