జోరుందుకున్న ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజలు
మండలం లో ప్రతీ గ్రామం లో
ఇండ్ల కు ముగ్గులు పోస్తున్న అధికారులు
కొత్తగూడ, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లకు ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది పేదింటి వాడి సొంతింటి కల నెరవేరే అవకాశం మరి కొద్ది రోజుల్లో పూర్తవునుంది..ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు తప్ప తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రజలు సొంతింటి కల నెరవేరుతుందని కోటి ఆశలతో ఎదురు చూశారు కానీ గత పాలకుల నిర్లక్ష్యం వారి స్వార్థాలతో పదేళ్లపాటు సొంత గూడు లేక అల్లాడిపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఊరటనిచ్చింది.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొత్తగూడ మండలంలోని పోగుల్లపల్లి గ్రామంలో
శనివారం రోజు ప్రభుత్వ అధికారులు పంచాయతీ కార్యదర్శి బి కళ్యాణి
ఆధ్వర్యంలో ముగ్గు పొసే కార్యక్రమం నిర్వహించారు..ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు పేర్లు1 బుగ్గ పద్మ.2. భూక్య అనిత 3. మోకాళ్ళ మౌనిక 4 బైరబోయిన రజిని 5 జూల వనక్క 6 బోళ్ల పద్మ 7 శిరపోయిన లచ్చమ్మ 8 నక్క సారమ్మ 9 బోళ్ల సమ్మక్క 10 శిర బోయిన స్వరూప 11 ముత్యం మమత 12 రాగి దేవేంద్ర 13 మొత్తం సప్న 14 దొంతర బోయిన రాధిక 15 కాగితం వెంకటమ్మ 16 నన్నే బోయిన కోమల 17 పడిగే నర్సమ్మ 18 గుగ్గిళ్ళ దీవెన.. అను లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు…
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు డేగల భద్రయ్య కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షులు చొప్పరి కుమార్,గ్రామ పెద్దలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు….