ఇందిరమ్మ ఇండ్లకి భూమి పూజ
నాగర్ కర్నూల్ నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఎర్రకుంట తండా, లట్టుపల్లి, చిన్న పీరు తండా, బిజినేపల్లి తండా బోయపూర్ డాకు తండా, రావుల చెరువు తండాలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి.. వారి కళా సహకారం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.