ఔదార్యాన్ని చాటుకున్న భీమ్ యువత..

Bhim youth showing generosity..

ఔదార్యాన్ని చాటుకున్న భీమ్ యువత

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన నీరటి సాయికుమార్ ఈ నెల 11 వ తేదీన అనారోగ్యం తో మరణించాడు. వారి ఆర్థిక స్థితి బాగోలేదని తెలుసుకున్న భీమ్ యువత గురువారం రోజున వారి ఇంటికి వెళ్లి 12000 రూపాయలు మరియు 25 కిలోల రైస్ బ్యాగ్ ను అందించి మానవత్వాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో భీమ్ యువత సభ్యులు లింగాల సందీప్, ఈసరి కిరణ్, గడ్డం వెంకటేష్, బుర్క రాకేష్, బుర్క రాజు, గడ్డి నరేష్, వరస రాకేష్ లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!