ఘనంగా బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్(సిల్వర్ జూబ్లీ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…..
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-
జడ్.పి.హెచ్.ఎస్ బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్ విద్యార్థులు… 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా“””25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ”” కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పుడు పాఠాలు నేర్పించిన టీచర్లు అందర్నీ పిలిచి శాలువాలు, పూలదండలు, మొక్కలు,, మెమొంటో లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీచర్లందరూ విద్యార్థుల తీరును చూసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మా విద్యార్థులు మరింత పైకి ఎదగాలని, మరిన్ని గొప్ప గొప్ప ఆశయాలను పూర్తి చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. విద్యార్థులు ఆటపాటలతో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థుల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిహెచ్ఎల్ జడ్పిహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల తో పాటు పలువురు పాల్గొన్నారు…