
Bharatiya Mazdoor Sangh.
భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన జిల్లా కమిటీ
మంచిర్యాల జులై 23, నేటి ధాత్రి
ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నం బట్టి వాడ 100 పిట్ల రోడ్డులో గల భారతీయ మజ్దూర్ సంఘ్(బి.ఎమ్.ఎస్) జిల్లా కార్యాలయంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావించి నేటితో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంటాల శంకర్ బి.ఎమ్.ఎస్. జెండా ఎగరవేసి కార్మికులతో కలిసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా కుంటాల శంకర్ మాట్లాడుతూ, జూలై 23, 1955 సంవత్సరంలో బాల గంగాధర్ తిలక్ జన్మదినం సందర్భంగా దత్తోపంత్ టెన్గ్డే జీ భారతీయ మజ్దూర్ సంఘ్(బి.ఎమ్.ఎస్) కార్మిక సంఘాన్ని ప్రారంభించారు,కార్మిక హక్కుల సాధన కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.మరియు భారతీయ మజ్దూర్ సంఘ్ దేశములోని రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న ఏకైక సంఘం బి.ఎమ్.ఎస్. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.ఎం.ఎస్. జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్, ఉపాధ్యక్షులు కృష్ణ రెడ్డి, రత్నాకర్ మహానంద్,సంగెం లక్ష్మణ్, వేల్పుల స్వామి,బండి వెంకటేశ్వర్లు, సిద్దు, సంతోషం లో పాల్గొన్నారు