భగత్ సింగ్ 94 వ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయండి.
న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ*
నర్సంపేట,నేటిధాత్రి:
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరితాడును ముద్దాడిన యువ కిశోరులు కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల 94వ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ నర్సంపేట పట్టణంలోని న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.పిడిఎస్యు, పివైఎల్, సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు 94 వ వర్ధంతి వారోత్సవాలను జరపాలని పిలుపునిచ్చాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడుతూ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత విద్యార్థి నిరుద్యోగులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న దురాహంకారానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.అలాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఈపి 20-20 మరియు యుజిసి ముసాయిదాలను రద్దు కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్స్ లర్ విద్యార్థి సంఘాలు చేసే ఆందోళన ఇతర కార్యక్రమాలపై నిషేధం ఎత్తివేతకు పోరాడాలని కోరారు.నేడు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న బిజెపి మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు గట్టి కృష్ణ,ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు భోగి సారంగపాణి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరు పూలక్క,గుగులోతు భద్రాజి భీమగాని మల్లయ్య,బరిగల కుమార్, గొర్రె ప్రదీప్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.