భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం తునికాకు వ్యాపారులు,కాంట్రాక్టర్లతో సమావేశమైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాచలం నేటి ధాత్రి

తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన తునికాకు వ్యాపారులు మరియు కాంట్రాక్టర్లతో ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎస్పీ నిషేధిత సిపిఐ మావోయిస్టుల వలన తునికాకు వ్యాపారులకు ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తునికాకు సేకరణపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని వారికి సూచించారు.ఏజెన్సీ ప్రాంతాల్లో తునికాకు సేకరణ గురించి తిరిగే వ్యాపారులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.నిషేధిత సిపిఐ మావోయిస్టుల గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు.పరోక్షంగానైనా,ప్రత్యక్షంగానైనా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ వారికి సహకారం అందించినట్లు తెలిస్తే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్బంగా ఎస్పీ హెచ్చరించారు.ఆదివాసీ ప్రజలకు నష్టం వాటిల్లకుండా,వారి సంక్షేమం కొరకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *