సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం పట్టణంకి చెందిన వారు ఆరోగ్యం బాగొలేక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది వాటికి సంబంధించిన బిల్లులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేయగా వారికి చెక్కులు రావడం జరిగింది. అట్టి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా సంబంధిత వారికి అందజేసారు.

శిల్పినగర్ కాలనీ చెందిన ఉపేందర్ కు 60000 వేల రూపాయల చెక్కను అందజేసినందుకు
వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, అరికెల తిరుపతిరావు, భీమవరపు వెంకటరెడ్డి, గాడి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *