మునీర్ అన్నకు నివాళులు అర్పించిన బెల్లంపల్లి.

Tribute Tribute

మునీర్ అన్నకు నివాళులు అర్పించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు.

బెల్లంపల్లి నేటిధాత్రి:

బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం ఆద్వర్యంలో కలం యోధుడు ఉద్యమనేత సీనియర్ పాత్రికేయులు దివంగత జర్నలిస్టు మునీర్ అన్నకు బెల్లంపల్లి పాత్రికేయుల నివాళులు అర్పించారు. సోమవారం రోజు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్ర
పటాన్ని ఏర్పాటుచేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సజ్ను ఫఫీ మాట్లాడుతూ మునీర్ భాయ్ పత్రికా రంగానికి విశేష సేవలు అందించడం తోపాటు కార్మిక వర్గానికి చేసిన సేవ లను గుర్తు చేసుకున్నారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి సదానందం మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వరకు మడమతిప్పని పోరాటాలు చేసిన మహనీయుడని, పత్రికా రంగంలో సీనియర్ పాత్రికేయుడుగా రాణిస్తూ విశ్లేషణాత్మకమైన కథనాలతో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విశేష కృషిని చేయడం జరిగిందని, నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ పత్రికల్లో
బాధ్యతలు స్వీకరించి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలిని ప్రదర్శించి ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా నిలిచిన మునీర్ భాయ్ సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్ర
మంలో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ టేకుల బస్తి ఉపాధ్యక్షుడు ఇరుకుల్ల రమేష్,
ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ పాండే,కోశాధికారి కత్తుల నవీన్,కార్య
వర్గ సభ్యులు టి.శ్రావణ్, కె.రమేష్ ,
కె.సాగర్, ఉపాధ్యక్షుడు దండబోయిన భాస్కర్, ప్రధాన కార్యదర్శి సుభాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!