Stay Alert Against Online Frauds
ఆన్లైన్ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండండి
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కెనరా బ్యాంక్ హద్నూర్ శాఖ అధికారులు సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. అపరిచిత ఫోన్ కాల్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటిపి ఇతర వివరాలను తెలుపకూడదని, అజాగ్రత్త, అప్రమత్తత వల్ల నిరాశ్రయులుగా మారవద్దని బ్యాంక్ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా హద్నూర్ గ్రామ సర్పంచ్ మతంశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఓ టి పి, ఆన్లైన్ లింకులు, ఆకర్షిత చిత్రాల పట్ల అప్రమత్తంగా ఉండి, ఆన్లైన్ దొంగతనాల బారిన పడకూడదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారి ప్రశాంత్, పంచాయతి కార్యదర్శి ధనరాజ్, ఉప సర్పంచ్ రూబీనా షబ్బీర్ ఖాన్, ప్రజలు పాల్గొన్నారు.
