మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
దుగ్గొండి సీఐ సాయిరమణ.
మత్తు పదార్థాల పట్ల ఎంజెపి స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు
నర్సంపేట నేటిధాత్రి:
మత్తు పదార్థాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని దుగ్గొండి సీఐ
సాయిరమణ అన్నారు.మత్తు పదార్థాలకు బానిసైన కొంత మంది యువత,విద్యార్థులు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలియజేశారు.
దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో గల మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల పాఠశాలలో మరకద్రవ్యాలు,మత్తు పదార్థాల పట్ల ఎక్సైజ్ శాఖ, జిల్లా మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ, జిల్లా మహిళా సాధికారత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దుగ్గొండి సీఐ సాయి రమణ పాల్గొని మాట్లాడుతూ అపరిచితుల మాయమాటలకు లోనుకావద్దని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు లోనవకుండా జాగ్రత్తలు పడాలని సూచించారు. సెల్ ఫోన్స్ చూడడం వల్ల విలువైన సమయాన్ని కోల్పోతారని ఈ సందర్భంగా సిఐ వివరించారు. ఎస్సై రణధీర్ మాట్లాడుతూ వివిధ రకాలుగా సైబర్ మోసగాళ్లు ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నారని, మీ అకౌంట్కు వంద రూపాయలు పంపించామంటూ లింకులను పంపి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని, అటువంటి లింకులను ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడాలని విద్యార్థులకు సూచించారు. బహుమతుల పేరుతో పలు విధాల మోసాలు జరుగుతాయని చెప్పారు.మాయమాటలకు లోవనకుండా జాగ్రత్తలు పడాలని సూచించారు.అనంతరం మత్తు పదార్థాల బారిన పడకుండా వారికి దూరంగా ఉంటామని,వాటి నిర్మూలనకు తమ వంతుగా పాలుపంచుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై శార్వాణి, పాఠశాల ప్రిన్సిపల్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.