సొంతింటి కల నెరవేర్చకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం…

సొంతింటి కల నెరవేర్చకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి

శ్రీరాంపూర్, మంచిర్యాల నేటి ధాత్రి:

 

 

సింగరేణి కార్మికులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న సొంతింటి కల పథకం ప్రభుత్వం, యాజమాన్యం నెరవేర్చకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధమేనని కార్మికులు, యూనియన్లకు అతీతంగా కార్మిక నాయకులు సూచనలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం ఇందారం 1ఎ గనిలో సిరికొండ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ద్వార సమావేశంలో ఆయన పాల్గొని పొంతింటి పథకంపై బ్యాలెట్ నమూనా వాల్ పోస్టర్ ను కార్మికులతో ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11,12వ తేదీలలో సొంతింటి పథకంపై సిఐటియు నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణలో భాగంగా నమూనా బ్యాలెట్ నిర్వహిస్తున్నందున కార్మికులు పాల్గొనాలని అన్నారు.అలాగే 15 వ తేదీన వాస్తవ లాభాలు ప్రకటించాలని,35 శాతం వాట కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిఎం కార్యాలయాల ముందు చేపట్టే ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒకవైపు ప్రతిపక్షాలు ఆందోళనలు ధర్నాలకు పిలుపునిస్తుంటే దసరా దగ్గర పడుతున్న ఇంకా లాభాల వాటా ప్రకటన చేయకపోవడం గుర్తింపు,ప్రాతినిధ్య సంఘాలకు సిగ్గుచేటని విమర్శించారు.తక్షణమే వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు లాభాల వాట చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.యాజమాన్యంపై గతంలో పోరాటాలు చేసిన గుర్తింపు,ప్రాతినిథ్య సంఘాల నాయకులు ఇప్పుడు వినతి పత్రాలకు పరిమితమయ్యారని ఆరోపించారు.ఇప్పటికైనా అన్ని సంఘాలను కలుపుకొని కార్మిక వర్గ శ్రేయస్సు కోసం యాజమాన్యంపై పోరాటాలు చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ బ్రాంచ్ నాయకులు కస్తూరి చంద్రశేఖర్,వెంగళ శ్రీనివాస్, వెంకట్ రెడ్డి,కిషన్ రెడ్డి,నవీన్, ఐత శ్రీనివాస్,షేక్ షావలి,మొయినుద్దీన్,ఇప్ప నరేష్,వినయ్,సుదీర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version