నవంబర్ 9న బీసీల మహాసభ…

-బీసీ రిజర్వేషన్ల సాదన కోసం..నవంబర్ 9న భువనగిరిలో బీసీల రాజకీయ యుద్దబేరి మహసభ

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
‍ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక రాజకీయ పార్టిలను తేలంగాణలో రాజకీయంగా భూస్తాపితం చేస్తామని, బీసీ రిజర్వేషన్ల సాదన కోసం నవంబర్ 9న భువనగిరిలో లక్షాలాది మందితో బిసీల రాజకీయ యుద్దబేరి మహసభను నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో చేసిన బిల్లులను రాష్ట్రపతి, అలాగే అసెంబ్లీలో చేసిన చట్టాన్ని రాష్ట్ర గవర్నర్ తక్షణమే ఆమోదించి బీసీలకు తగిన న్యాయం చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్లను తమిళనాడు రాష్ట్ర తరహాలో పెంచడానికి 9వ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ను..రాష్ట్రంలో రాజ్ భవన్ ను ప్రభావితం చేస్తూ..బీసీలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. బీసీలపై బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లులను చట్ట రూపంలో తీసుకురావాలని కోరారు. బీసీ రిజర్వేషన్లను పెంచకుండా..బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కకుండా అగ్రవర్ణ పార్టీలు చేస్తున్న కుట్రలను ఎండగడుతూ..బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి నవంబర్ 9న భువనగిరిలో లక్షలాది మంది బీసీ సైనికులతో బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభను నిర్వహించి అగ్రవర్ణ పార్టీల కుట్రలను ఎండగడతామని ఆయన హెచ్చరించారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని, లేకుంటే బిజెపికి వ్యతిరేకంగా బీహార్ ఎన్నికలలో బీసీలమంతా ప్రచారం నిర్వహించి..బిజెపి కుట్రలను చిత్తు చేస్తామన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం మూలంగా బీసీలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని, వెంటనే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, చట్టసభలలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ క్రిమిలేయర్ రద్దు, ఉన్నత న్యాయస్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కల్పించడానికి దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టులలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి 42 శాతం రిజర్వేషన్ల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సమాచార కమీషనర్లు, ప్రభుత్వ సలహాదారులు, రాష్ట్ర మంత్రి వర్గంలో బీసీల జనాభా ప్రాతిపాదికన మంత్రులు, క్యాబినెట్ చైర్మన్ లు, సీఎం పేసి నుండి మొదలుకొని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ప్రభుత్వ సెక్రెటరీలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాల్సిందేనన్నారు. బీసీల పోరాటాన్ని రాజకీయ పోరాటంగా ముందుకు తీసుకెళ్ళేందుకు బీసీ మేధావుల సూచనలను, సలహాలను పరిగణలోకి తీసుకుని నవంబర్ 9న నిర్వహించబోయే భువనగిరి సభా వేదికగా రాజకీయ భవిష్యత్ ఎజెండాను ప్రకటిస్తామని వేముల మహేందర్ గౌడ్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version