దేశవ్యాప్తంగా బిసి కుల గణన చేపట్టాలి.

BC caste

దేశవ్యాప్తంగా బిసి కుల గణన చేపట్టాలి

పాదయాత్ర చేపట్టిన జాతీయ బిసి హక్కుల పోరాట సమితి

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల పట్టణంలోని ఐ.బి.చౌరస్తా నుండి హాజీపూర్ మండల కేంద్రం వరకు జాతీయ బిసి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం పాదయాత్ర చేపట్టారు.దేశవ్యాప్త బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జన గణన పట్టికలో 34 కాలమ్స్ ఉన్నాయి.కుల గణన చేరిస్తే అదనంగా ఒక కాలం మాత్రమే చేరుతుంది.దీనికి రూపాయి కూడా ఖర్చు కాదు ఒక కాలం చేర్చడానికి వెనుకాడుతున్న కేంద్రపాలకులు ఈ దేశంలో ఉన్న 85 కోట్ల మంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తారని అడుగుతున్నాం.జనగణలో కుల గణన భాగం చేస్తే విద్యా ఉద్యోగాలతో పాటు ప్రస్తుతం స్థానిక సంస్థలలో కొనసాగుతున్న రిజర్వేషన్ పెంచాల్సి వస్తదని కేంద్ర పాలకులు భావిస్తున్నారు. అలాగే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందని కేంద్ర పాలకులు భావిస్తున్నారు. అలాగే బీసీ కుల గణన అనుకూలంగా దేశంలో గుర్తింపు పొందిన 27 రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉన్నాయి.పది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ బీసీ కుల గణన చేపట్టకపోవడం అంటే ఇది బీసీల వివక్షగా భావిస్తున్నాం. పది సంవత్సరాల క్రితమే మేము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని చెప్పిన బిజెపి మోసం చేసింది అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా బిసి కులగణనకు శ్రీకారం చుడతామని చెప్పి మోసం చేసిన ఘనత బిజెపికి దక్కింది.ఇప్పటికైనా బీసీల న్యాయమైన డిమాండ్,బీసీల ఉద్యమ ఆకాంక్ష బీసీలకు రావాల్సినటువంటి ప్రజాస్వామ్యవాట ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో ఈ అంశాన్ని తీసుకెళ్లి బీసీ సమాజం ముందు బిజెపిని దోషిగా నిలబెట్టక తప్పదని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, డాక్టర్ రఘునందన్, నాయకులు శాఖ పురి భీమ్ సేన్,శ్రీపతి రాములు,పెండ్లి రాములు,ఆరెందుల రాజేశం, అంకం సతీష్ ,పంపరి వేణుగోపాల్,బండా సతీష్ అందే సంతోష్,చెలిమెల అంజన్న,భీమ్ రావు,సూర్ల శంకర్,ఎల్లాపుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!