
BC and Dalit groups protest against the insult of MLA Adi Srinivas
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను అవమానపరిచిన జిల్లా కలెక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి
బీసీ, దళిత సంఘాల డిమాండ్
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను అవమానపరిచి అగౌరపరచినందున అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాలుమరియు దళిత సంఘాలు గురువారం రోజున డిమాండ్ చేశాయి, కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసిన అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు గడ్డం నరసయ్య, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్పా దేవయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, పద్మశాల సంఘం పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాసు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రాగుల రాములు, ఎస్సీ ఎస్టీ సంఘం జిల్లా అధ్యక్షుడు కంసాల మల్లేశం ,
బీసీ సేన జిల్లా అధ్యక్షుడు బట్టు ప్రవీణ్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ లు గురువారం రోజున అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేసి మాట్లాడుతూ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఫోటోకాల్ పాటించకుండా మధ్యలోనే వచ్చి తన కారు సైరన్ సౌండ్ మోగించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని మరియు ప్రజా పాలన దినోత్సవాన్ని అగౌరపరిచి అవమానించారన్నారు, ఉద్దేశపూర్వకంగా ఒక బీసీ బిడ్డ ఆయన ఆది శ్రీనివాసును ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆది శ్రీనివాస్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు , చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన అనంతరం పై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు, ఆది శ్రీనివాస్ పై జరిగిన అవమానం యావత్తు బీసీ ,దళితులకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నామన్నారు, చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పర్ష హన్మాండ్లు,గడ్డం నరసయ్య, కత్తెర దేవదాసు , బొప్ప దేవయ్య , చొక్కాల రాము, గోలి వెంకటరమణ, రాగుల రాములు ,రాగుల జగన్ ,బట్టు ప్రవీణ్ ,తడక కమలాకర్, కంచర్ల రాజు , రవీందర్, మల్లేశం ,ఇల్లంతకుంట తిరుపతి, నల్ల శ్రీకాంత్, సామల తిరుపతి తదితరులు పాల్గొన్నారు