రాజు పేట ఎస్సీ కాలనీలో బతుకమ్మ కనుమరుగయ్యా.!

SC Colony

రాజు పేట ఎస్సీ కాలనీలో బతుకమ్మ కనుమరుగైయ్యే ప్రమాదం లో ఉంది..

_ఎస్సీ కాలనీ వాసి జై భీమ్ రామ్మోహన్

మంగపేట నేటిధాత్రి

మంగపేట మండలం రాజుపేట గ్రామంలో ఎస్సీ కాలనీలో కాలనీవాసులందరూ కలిసి గత30 సంవత్సరాల క్రితమే కొంత స్థలాన్ని దేవుడి పేరు మీద కేటాయించుకొని.. అక్కడే అన్ని పండగలు జరుపుకునేవారు.. ముఖ్యంగా బతుకమ్మ వేడుకని అద్భుతంగా అందరూ కలిసి అదే స్థలంలో గత 15 సంవత్సరాల నుండి జరుపుకునేవారు కానీ ఈరోజు ఆ బతుకమ్మ ఈ ఎస్సీ కాలనీలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.. దేవుడి పేరు మీద ఉన్న స్థలం కాబట్టి ఆ స్థలంలో గుడి నిర్మించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు, ఎస్సీ కాలనీ ప్రజల, ఎస్సీ కాలనీలో ఉన్న మహిళల అంగీకారాలు వాళ్ల స్పందన తెలుసుకోకుండా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం సరైనది కాదు..చేసేది మంచి పని అయ్యినా అందరి అభిప్రాయాలు తెలుసుకునే కనీస బాధ్యత ఉండాలి కదా..ఆ స్థలంలో గుడి వస్తుంది మంచిదే..కానీ బతుకమ్మ ఆడే స్థలం లేదని మహిళలు లోలోపలే బాధపడుతున్నారు .. ఎస్సీ కాలనీ వాసులకు ఇదే స్థానిక కాంగ్రెస్ నేతలు బతుకమ్మ ఆడడానికి ఒక అనుకూలమైన, విశాలమైన స్థలాలను కేటాయించాలి..లేనిచో కాలనీ బతుకమ్మ పండుగ కనుమరుగైయ్యే ప్రమాదం ఉంది.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ముందు తరాలు వారసత్వ సంపద ఇవ్వలేని పరిస్థితిలో కాలనీ వాసులు ఉంటారు.. కావున గుడి నిర్మాణానికి మేము ఏమాత్రం వ్యతిరేకంగా కాదు గుడి నిర్మాణానికి మేము మద్దతు ఇస్తున్నాం కానీ బతుకమ్మ ఆడడానికి స్థిరమైన స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు కేటాయించకపోతే .. అప్పుడు తీవ్ర పరిణామాలు స్థానికుల నుండి ఎదుర్కోవాల్సి వస్తుందని మార్చిపోవద్దు..అని ఎస్సీ కాలనీ వాసి జై భీమ్ రామ్మోహన్ అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!