బండితోనే కమల వికాసం.
బండితోనే కమలనాధుల్లో ఊపు
బండితోనే భవిష్యత్తు బిజేపి గెలుపు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం.
తెలంగాణలో ఎప్పుడూ లేనంత గ్రాఫ్ పెంచించే బండి.
బండి మాటలతోనే యువత బిజేపి వైపు చూపు.
జాతీయ నాయకత్వం కూడా అదే ఆలోచిస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై ముందు అందరికీ అనుమానాలే.
అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ కనిపించిన నిరాశావాదం..
నామినేషన్ల తర్వాత కూడా బిజేపి నాయకులలో నెలకొన్న అనుమానం.
పట్టు వదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వం.
అభ్యర్థుల గెలుపు పట్ల బండి తీసుకున్న చొరవ చేరిన గెలుపు తీరం.
బిజేపిని గెలిపించి చూపిస్తా అన్నాడు.
కాంగ్రెస్ ను ఓడిరచి చూపించాడు.
టీచర్స్ ఎమ్మెల్సీ కూడా బిజేపి ఖాతాలో వేశాడు.
ఎమ్మెల్సీలను గెలిపించి చూపించిన ఘనత బండిదే.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బిజేపికి బలం పెరిగిందనడానికి సంకేతం.
టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారధ్యానికి సంకేతం.
మంత్రిగా వున్నా జనంలో వుండడమే సంజయ్కు ఇష్టం.
బిజేపి పార్టీ బలోపేతమే బండి లక్ష్యం.
బండికే మళ్ళీ పగ్గాలివ్వాలని పార్టీ నేతల ఆకాంక్ష.
బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కా.
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజేపి చారిత్రక విజయం సాధించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కందాల మీద వేసుకొని గెలిపించడంతో బిజేపి గొప్ప విజయాన్ని అందుకుంది. తెలంగాణ రాష్ట్రములోని బిజేపి నాయకులంతా అదే స్పూర్తిని అనురించాలి. తమ తమ రాజకీయ చతురతను, రాజకీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తే తెలంగాణలో బిజేపి తిరుగులేని శక్తిగా మారడానికి ఎంతో సమయం పట్టదు. వచ్చే ఎన్నికలలో నాటికి బిజేపి ఎదురులేని రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఓసారి లోతుగా విశ్లేషిస్తే మంత్రి బండి సంజయ్ చూపిన చొరవ అంతా ఇంతా కాదు. గత ఆరు నెలల కాలంగా ఒక్కో ఇటుకను పేర్చినట్లు తన ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేశాడని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికల విజయం ఒక తార్కాణం. ఎన్నికలలో బండి వ్యక్తి గత రాజకీయానికి బిజేపి బలం తోడై కమలం విజయం ఉత్తుంగ తరంగంలా విజయకేతనం ఎగరవేసింది. తెలంగాణ బిజేపి నాయకులు, శ్రేణులు బండి సంజయ్ను కొనియాడుతున్నారు. అసలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడమే కాదు, సరికొత్త చరిత్ర సృష్టించడం కూడా బిజేపికే చెల్లింది. నిజానికి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలంటే సహజంగా రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవు. కానీ యూనియన్లు పాలు పంచుకునే రాజకీయానికి కొత్త తరహా రాజకీయం కూడా చూపించింది బండి సంజయ్ అని చెప్పకతప్పదు. గతంలో ఇలా ఏ పార్టీ ధైర్యం చేయలేదు. టీచర్స్ ఎమ్మెల్సీలలో పార్టీల అభ్యర్థులను రంగంలోకి దింపే సాహసం చేయలేదు. బండి సంజయ్ అంటేనే ఒక సాహసం. ఒక ధైర్యం. నలుగురు నడిచే దారిలో నడిస్తే ప్రత్యేకత ఏముంటుంది. నలుగురికి దారి చూపించే సరికొత్త మార్గం వేసేవారికే సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. అది తెలంగాణ రాజకీయాలలో తన మార్క్ రాజకీయాన్ని చూపించి, విజయాన్ని సొంతం చేసిన ఏకైక నాయకుడు బండి సంజయ్. బండి సంజయ్ తోనే తెలంగాణలో బండితోనే కమల వికాసమని మరో సారి రుజువైంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా బండితోనే బిజేపికి ఊపు…బిజేపికి గెలుపు అని చెప్పకతప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ బిజేపి రాజకీయాలలో బండి సంజయ్ కు ముందు, తర్వాత అని చెప్పడం కరక్ట్. గతంలో తెలంగాణలో బిజేపి ప్రభావం లేదని కాదు. ఆ పరంపరను కొనసాగించడమే కాదు, ఊపును తెచ్చి విజయ తీరాలను బిజేపి ఒంటరిగా అందుకునేలా బండి నాయకత్వం పని చేసింది. తెలంగాణలో సహజంగా హైదరాబాద్ లో బిజేపి ఎంతో కొంత కీలక భూమికనే పోషించేది. ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడూ జిహెచ్ఎంసిలో సీట్లు పది దాటింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి జిహెచ్ఎంసి ఎన్నికలలో కనీస ప్రభావం కనిపించలేదు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ రంగంలోకి దిగారో అప్పుడే సీన్ మారిపోయింది. బిఆర్ఎస్ కు సీన్ సితారైంది. బిజేపి జిహెచ్ఎంసి ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఒక్క అంశం చాలు. బండి రాజకీయం ఎలా వుంటుందో చెప్పడానికి…గత ఎన్నికల ముందు బండి దూకుడుకు ఎందుకు కళ్లెం వేశారో ఎవరికి అర్థం కాలేదు. ఎన్నికల దాక బండి సంజయ్ అధ్యక్షుడుగా వుండే ఆ రాజకీయాలే మరోలా వుండేవి. కాంగ్రెస్ పార్టీ అధికారపు అంచులను తాకేది కాదు. బిఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చేవే కాదు. కానీ అనుకోని రాజకీయ ఎత్తుగడలు బండిని లాగేయాలని చూసినా, పార్టీ కోసం నిరంతరం పరిశ్రమించే నాయకుడు సంజయ్. ఇప్పటికీ మించి పోలేదు. బిజేపి నాయకుల చూపంతా బండి నాయకత్వం వైపే ఆసక్తిగా చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మరో సారి బండి చాతుర్యం సాక్ష్యంగా నిలిచింది. బండితోనే భవిష్యత్తు బిజేపి గెలుపు కార్యకర్తలు మరింత బలంగా నమ్మడానికి కారణమైంది. తెలంగాణలో ఎప్పుడూ లేనంత గ్రాఫ్ పెంచించే బండి సంజయ్ మాత్రమే. ఎందుకంటే తెలంగాణ యువతను బిజేపి వైపు మళ్లించడంలో బండిపోషించిన పాత్ర అందరికన్నా పెద్దది. ఒకప్పుడు బిజేపి చిన్న చిన్న పట్టణాలకే పరిమితం. ఇప్పుడు తెలంగాణ లో ప్రతి పల్లెల్లో బిజేపి జెండా ఎగురుతోంది. ప్రతి గ్రామంలో బిజేపి పార్టీ ఏర్పడిరది. ప్రతి ఊరులోనూ బిజేపి బలంగా మారుతోంది. జాతీయ నాయకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిషాల జపం యువత చేస్తున్నారంటే ముమ్మాటికి అది బండి సంజయ్ కృషి అని చెప్పాలి. బండి మాటలతోనే యువత బిజేపి వైపు చస్తున్నారు. జాతీయ రాజకీయాల వైపు యువత ఆలోచనలు చేస్తున్నారు. ఒకప్పుడు పల్లెల్లో ఎర్ర జెండాలు కనిపించేవి. ఆ జెండాలు పోయి, అంతటా కాషాయ జెండాలు ఎగురుతున్నాయి. అందుకు ప్రధాన కారణం బండి సంజయ్. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే బిజేపి అభ్యర్థుల ఎంపికపై ముందు అందరికీ అనుమానాలే వుండేవి. ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థుల ఎంపిక సమయంలో బిజేపి శ్రేణులలో నిరాశావాదం ఆవహించింది. అంతెందుకు నామినేషన్ల తర్వాత కూడా బిజేపి నాయకులలో అనుమానం అలాగే వుంది. కానీ బండి సంజయ్ ప్రచార రంగంలోకి దిగిన తర్వాత ఆ మాటలు మాయమై పోయాయి. పట్టు వదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వంతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతిన్నది. బిజేపి ప్రచారంలో దూసుకుపోతుంటే అప్పుడే కాంగ్రెస్ చేతులెత్తేసింది. అభ్యర్థుల గెలుపు పట్ల బండి తీసుకున్న చొరవ గెలుపు తీరం చేర్చింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయంలో మిగతా బిజేపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకుల పాత్ర అంతా ఒక ఎత్తు. బండి సంజయ్ సాగించిన ప్రచారం మరో ఎత్తు. ఎందుకంటే బిజేపిని గెలిపించి చూపిస్తా అని బండి సంజయ్ శపధం చేశాడు. బిజేపి అభ్యర్థులను గెలిపించి, కాంగ్రెస్ ను ఓడిరచి చూపించాడు. టీచర్స్ ఎమ్మెల్సీ కూడా బిజేపి ఖాతాలో వేశాడు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బిజేపికి బలం పెరిగిందనడానికి బండి నాయకత్వమే సంకేతం. టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారధ్యానికి నిదర్శనం. కేంద్ర మంత్రిగా ఎంతో బిజీగా వున్నా జనంలో వుండడమే సంజయ్కు ఇష్టం. జనం సమస్యల పరిష్కారమే బండి సంకల్పం. కేంద్ర మంత్రిగా వున్న వాళ్లు గతంలో కంటికి కనిపించే వారు కాదు. అధికారిక కార్యక్రమాలు తప్ప జనంలో నడిచింది లేదు. కారు దిగి ప్రజల వద్దకు వచ్చే వాళ్లు కాదు. కానీ బండి అలా కాదు. సికింద్రాబాద్ లో గుడి విషయంలో అలజడి నెలకొంటే జనం మధ్యలో వున్నారు. అశోక్ నగర్లో గ్రూపు అభ్యర్థులు నిరసనలు తెలియజేస్తుంటే వారికి సంఫీు భావం తెలిపారు. తాను కేంద్ర మంత్రిగా కాకుండా, ఒక బిజేపి సామాన్య కార్యకర్తగా నిరుద్యోగుల ఉద్యమంలో పాల్గొన్నారు. ఎప్పటికైనా తెలంగాణలో బిజేపి పార్టీ బలోపేతమే బండి లక్ష్యం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజేపి విజయం సాధించడం ఆ పార్టీకి ఎంతో ఊపునే కాదు, మరింత ఊపిరి పోసినట్లైంది. దాంతో బండి సంజయ్ పై బిజేపి నాయకులలో మరింత నమ్మకం పెరిగినట్లైంది. అందువల్ల బండికే మళ్ళీ పగ్గాలివ్వాలని పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో కోరుతున్నారు. బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కా బలంగా విశ్వసిస్తున్నారు. కేంద్ర బిజేపి నాయకత్వం కూడా అదే ఆలోచిస్తోంది. ఈ సారి అధ్యక్ష ఎంపిక బండి సంజయ్కే అప్పగించాలని అనుకుంటోంది. మంత్రి పదవి బండి సంజయ్ కు అడ్డంకి కాదు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిలో వుండి కూడా బండి మంత్రిగా కొనసాగడం ఇబ్బంది ఏ మాత్రం కాదు. మంత్రిగా కొనసాగిస్తూనే బండికి అధ్యక్ష పదవి మరోసారి ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.