నిజాంపేట ఎస్సైగా బండి రాజేష్
నిజాంపేట: నేటి ధాత్రి
మండలం నూతన ఎస్సైగా బండి రాజేష్ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై నిజాంపేట మండల కేంద్రానికి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానన్నారు.