బండి కుమారస్వామి బాధితుడు మృతి
బయటకు వస్తున్న బండి బాధితులు.
నేటిధాత్రి, వరంగల్
మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ కు పెరుగుతున్న బండి బాధితుల సంఖ్య..
నాలుగు రోజుల క్రితం జరిగిన పెట్రోల్ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు మృతి.
బండి మీద పీడీ యాక్ట్ నమోదు చేయండి. దళిత సంఘాల డిమాండ్..
మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ లో పెరుగుతున్న పిర్యాదుల సంఖ్య.
గతంలో ఏకంగా బండి కుమారస్వామి పేరిట బాధితుల సంఘం ఏర్పాటు..
ఒకే వ్యక్తిపై మిల్స్ కాలని పోలీసు స్టేషన్ లో 30 కి పైగా కేసులు?
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి “బండి” పయనం..

భూ కబ్జాదారుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..
న్యాయం చేయాలి
భూ కబ్జాదారుల( బండి కుమారస్వామి, పులి రంజిత్ రెడ్డి, తాళ్ల పద్మావతి కాలేజీ యాజమాన్యం) ఆగడాలకు బలైపోయిన నిరుపేద దళితుడు పోలేపాక కుమారస్వామి వారి కుటుంబానికి న్యాయం చేయాలి.
మాదాసి సురేష్
ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ హనుమకొండ!