
SFI leaders Vamsi, Mahesh, Ranjith, Krishna, Suresh, Shanthikumar and others participated.
వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో బంధు విజయవంతం
పరకాలలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంధు
పరకాల నేటిధాత్రి
రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం పరిష్కారించాలని విద్యార్ధి సంఘాలు చేప్పట్టిన బందు పరకాల పట్టణంలో ప్రశాంతంగా కొనసాగిందని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు.ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్,మండల అధ్యక్షుడు మడికొండ మడికొండ ప్రశాంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ పట్టణంలో ప్రైవేట్ స్కూలు మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సైతం బందుకు మద్దతు తెలిపారని అన్నారు.ఖాళీగా ఉన్న టీచర్,ఎంఈఓ,డిఈఓ పోస్టులు భర్తీ చేయాలని,ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి,పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ నిదులు,అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌళిక సదుపాయాలు కల్పించాలని,పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని,అద్దె భవననాలలో నడుస్తున్న వసతి గృహలకు స్వంత భవనాలు నిర్మించాలని,గురుకులాలలో అశాస్త్రీయంగా తీసుకు వచ్చిన సమయపాలనను మార్చాలని బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని,ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ నిధులు ఇవ్వాలని,విద్యార్థులకు ఆర్టీసిలో ఉచిత బస్పాసులు ఇవ్వాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్,లెక్చరర్ పోస్తులు భర్తీ చేయాలని ఎన్ఈపి-2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని బందుకు పిలుపునిచ్చామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ,మహేష్,రంజిత్,కృష్ణ,సురేష్,శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.