బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారులు ఉన్నత స్థాయికి వెళ్ళాలి
జిల్లా యువజనక్రీడల శాఖ అధికారి చిర్ర రఘు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలో వేసవి క్రీడ శిక్షణ శిబిరాలను వివిధ మండలాలలో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా నేడు గణపురం జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో నిర్వహిస్తున్న బాల్ బ్యాడ్మింటన్ క్యాంపు ని జిల్లా యువజనక్రీడల శాఖ అధికారి చిర్రా రఘు సందర్శించారు.డి వై ఎస్ ఓ మాట్లాడుతూ క్రీడాకారులు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని బాల్ బ్యాడ్మింటన్ క్రీడలలో మెలకువలు నేర్చుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశించారు.

ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ కోచ్ రవీందర్ , ఫిజికల్ డైరెక్టర్, పి ఈ టి ప్రెసిడెంట్ ఎస్ రమేష్ పి ఈ టి సెక్రెటరీ ఎస్ సురేష్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులకు దాతల సహాయంతో ఉదయం టిఫిన్స్ మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ భోజన సౌకర్యానికి సహకరించిన దాతలు హనుమకొండ పీసీ సతీష్ అంజాద్, రాజు,పీసీ సదయ్య, కంచర్ల సతీష్, పసునూటి శంకర్, సతీష్, మైలారం అశోక్, రవి రెక్స్, జెన్కో కృష్ణకర్ అందించడం జరిగింది. బాల్ బ్యాట్మెంటన్ వేసవి శిక్షణలో భాగంగా బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు పసునూటి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.