నేటి, ధాత్రి:
మంచిర్యాల జిల్లా
చెన్నూరు నియోజవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ గురువారం ఉదయం చెన్నూర్ ఆర్డీవో కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి దత్తుకు మొదటి నామినేషన్ పత్రాలను అందజేశారు.
జైపూర్ మండలంలోని వివిధ గ్రామాల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో తరలి వెళ్లారు.తొలుత స్థానిక జగన్నాధ ఆలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మండల ఎంపీపీ మంత్రి బాపు, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్ రావు, డాక్టర్ రాజా రమేష్, సీనియర్ నాయకులు సర్వోత్తమరెడ్డిలతో కలిసి నామనేషన్ దాఖలు చేశారు.
దీనిలో భాగంగా చెన్నూరు ఆర్డీవో కార్యాలయం వద్ద కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొద్దీ సేపు తోపులాట జరిగింది.
కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ,బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఒకేసారి నామినేషన్ కు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.