రేపటి నుంచి బడంపేట రాచన్న స్వామి దేవాలయ జాతర
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం బడంపేట గ్రామ శివారులోని రాచన్న స్వామి దేవాలయ జాతర ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శివ రుద్రప్ప శనివారం తెలిపారు.
22న రుద్రాభిషేకం, ధ్వజారోహణ, 23న ప్రత్యేక పూజలు, 24న కళ్యాణోత్సవం జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.
