బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు.
నిజాంపేట, నేటి ధాత్రి
నిజాంపేట మండల కేంద్రంలో శనివారం రోజున డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 118 వ జయంతి ఉత్సవాలను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ 1975 సంవత్సరంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేయడంతో ఇందిరా గాంధీ ఎదురులేని నాయకురాలుగా ఉన్న సమయంలో ఆమెకు ఎదురు తిరిగిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ ఆయన బీహార్ రాష్ట్రంలో చాంద్ గ్రామంలో 19O8 ఏప్రిల్ 5వ తేదీన జన్మించాడు.తల్లి వసంతి దేవి తండ్రి శోభిరామ్ లు ఆయన చిన్నతనంలోనే స్కూల్లో హిందువులకు ఒక కుండ క్రైస్తవులకు ఒక కుండా ముస్లింలకు ఒక కుండా అంటరాని వాళ్లకు ఒక్కకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కుండలను చూసి చలించిపోయి అందరికీ ఒకే కుండా ఉండాలన్న ఆలోచనతో అన్నిటిని మొదలుపెట్టడం జరిగింది. మనుషులంతా ఒక్కటే ఒకే కుండలో అందరం తాగాలి అని ఒక గొప్ప మనసుతో ఆలోచించేవాడు, బాబు జగ్జీర్రావ్ తండ్రి శోభిరామ్ సైన్యంలో పనిచేసేవాడు, అక్కడ అంటరానితనం వివక్ష చూసి అక్కడి నుండి ఇంటికి వచ్చి 20 ఎకరాల భూమి లో వ్యవసాయం చేస్తూ, అంటరానితనం కులవ్యక్ష మీద ప్రజలకు చైతన్యం చేయడంజరిగింది. బాబు జగ్జీవన్ రావు ఒక కుమారుడు ఒక కుమార్తె కుమారుని పేరు సురేషు కూతురు పేరు మీరా కుమారి కలరు.
ఆయన సామాజికంగా ఆర్థికంగా పేదరిక నిర్మూలనకు ఎంతో కృషి చేసిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రావు 1929లో అంటరాని ప్రజల గురించి ఉత్తర ప్రదేశ్ బెంగాల్ బీహార్ ప్రజలను సమీకరించి 35 వేల మందితో ఊరేగింపు నిర్వహించాడు. ఆయన జీవితంలో అదొక గొప్ప చరిత్ర కలిగిన రోజు అదే ఆయన రాజకీయానికి పునాది 1935లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో బాబు రాజేంద్రప్రసాద్ తో స్నేహం ఏర్పడింది,బాబు జగ్జీరావ్ 1931లో గొప్ప సైంటిస్ట్ కావాలని నిర్ణయంతో సైంటిస్ట్ ను అయితే నేను బాగుపడతా నా కుటుంబాలు బాగుపడతాయి, కానీ పేద బడుగు బలహీనవర్గాల పరిస్థితి ఏంటి అని నిర్ణయించుకొని అంటరాని వాళ్ళు కులవ్యవక్షత దుర్భారం గడుపుతున్న మా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి వారి గురించి, నేనే పోరాడాలి అని గొప్ప సంకల్పంతో ఆలోచన చేస్తాడు అంటరాని వాళ్ళు చదువుకోవాలి అంటరాని వాళ్ళు మద్యపానం నిషేదించాలి పిల్లలను పశువుల కొట్టలాల్లో పనిచేయడం మానేయాలి,
నా జాతి పిల్లలు చదువుకోవాలి అని కొన్ని అభిప్రాయాలతో అట్టడుగు వర్గాలకు ఒక దిక్సూచిగా నిలిచాడు, ఆయన జీవితంలో 50 సంవత్సరాలుగా ఓటమెరుగని పార్లమెంటు సభ్యులుగా గొల్లిపొందిన మహా ఉన్నతమైన వ్యక్తి, ఆయన ఈ భారత దేశ ఉప ప్రధాని పనిచేశారు, ఆయన ఈ దేశ కేంద్రకార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న క్రమంలో ఎయిర్ ఇండియా జాతీయం చేశారు, అందులో 7000 ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అమలు చేశారు, అదే విధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్ ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు కొమ్మాట సుధాకర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అమర్
మాల మహానాడు కార్యదర్శి టంకరి లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షులు బండారి ఎల్లం,ఎరుకల సంఘం మండల అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్, కొతాడి నర్సింలు, ఎండి బిలాల్, కొమ్మాట స్వామి, నందిగామ బాబు తదితరులు పాల్గొన్నారు.