వేములవాడ నేటిధాత్రి
శిఖర ఆర్ట్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలందిస్తున్న ,రాణిస్తున్న ప్రతిభా వంతులను తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసి వారికి నంది ప్రతిభా పురస్కారాలు – 2024 రవీంద్ర భారతిలో సోమవారం ఇవ్వడం జరిగింది.ఇందులో భాగంగా మన వేములవాడ కు చెందిన అయాచితుల జితేందర్ రావు గత 17సంవత్సరాలుగా విద్యారంగంలో గీతా విద్యాసంస్థల ఆధ్వర్యంలో గీతా జూనియర్ కళాశాల మరియు వైష్ణవి డిగ్రీ కళాశాలను నిర్వహిస్తూ చాలా మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ,ఎందరో విద్యార్థులను వారి అభ్యున్నతి కి పాటుపడుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినందుకు నంది పురస్కారంతో సత్కరించింది.ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తానని,పేద పిల్లలు ఎవరైనా ఉంటే నా దృష్టికి తీసుకువస్తే వారికి ఆర్థిక సాయం తో పాటు ఉచిత విద్య అందిస్తానని, విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడతానని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా విశిష్ట అతిధిగా దైవాజ్ఞ శర్మ, ముఖ్యఅతిథిగా కథా రచయిత జేకే భారవి, సభాధ్యక్షులు రంగస్థల నటులు ఉమామహేశ్వర్,ఆర్గనైజర్ ఉప్పులేటి నవీన్,విష్ణు, అశోక్,బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.