జీవన ఎరువులఫై రైతులకు అవగాహ సదస్సు
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:
దుగ్గొండి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సొసైటీ ఆవరణలో జీవన ఎరువుల వాడకం వలన లభించే లాబాల పట్ల వరంగల్ జిల్లా జాతీయ ఆహార భద్రత మిషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్యామ్ అధ్యక్షతన నిర్వహించారు. జాతీయ ఆహరా భద్రత మిషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్సల్ టెంట్
పి సారంగం టెక్నీకల్ అసిస్టెంట్ యం. రవి కుమార్ మాట్లాడుతూ జీవన ఎరువులు ప్రకృతిలో సహజంగా ఉండే సూక్ష్మజీవులను ఉపయోగించి వాడడం వలన భూసారాన్ని పెంచి, పంటలకు అవసరమైన పోషకాలను అందించి, మొక్కల పెరుగుదల ఆరోగ్యకరంగా ప్రోత్సహిస్తాయన్నారు.
రసాయన ఎరువుల వాడకం తగ్గి వాతావరణ కాలుష్యాన్ని అరికడతాయని పేర్కొన్నారు.తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వలన అనేక నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.అలాగే సేంద్రియ ఎరువులు తయారుచేసే విదానాన్ని ప్రత్యక్షంగా చేసి చూపించారు.ఈ సదస్సులో పలువురు అధికారులు,రైతులు పాల్గొన్నారు
