ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

Awareness program on traffic rules Awareness program on traffic rules

ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

*నేడు హైవే రోడ్డు లో తన పల్లి క్రాస్
వద్ద వాహన తనిఖీలు..

తిరుపతి నేటి ధాత్రి :

జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీస్.ఆదేశాల మేరకు ట్రాఫిక్ డిఎస్పి
రామకృష్ణ చారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు,
నేడు హైవే రోడ్డు లో తన పల్లి క్రాస్ నుంచి ఆర్.సి పురం జంక్షన్ వరకు వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది.
వాహన తనిఖీల్లో భాగంగా వాహనం నడిపేటప్పుడు వ్యతిరేక మార్గంలో వాహనం నడిపితే ప్రమాదాలు జరుగుతాయని, ఎవరూ కూడా వ్యతిరేక మార్గంలో వాహనాలు నడపరాదని సూచించడం అయింది.
ప్రతి ఒక్కరు కూడా ద్విచక్ర వాహనం నడిపినప్పుడు తప్పనిసరిగా ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని సూచించడం అయింది.
వాహనం నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా సంబంధిత రికార్డులు కలిగి ఉండాలని సూచించడం అయినది.
రికార్డ్స్ లేనటువంటి 17 ద్విచక్ర వాహనాలు మరియు 06 కార్లు, 01,జెసిబి,
మొత్తం 24 వాహనాలను సీజ్ చేయడమైనది.
వాహనదారులకు కొత్త మోటర్ వెహికల్ చట్టం – 1998 (అమెండ్మెంట్ ఇన్ – 2019) వాటిపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ చారి ట్రాఫిక్ డిఎస్పి, సంజీవ్ కుమార్ సిఐ షేక్క్షావల్లి ఎస్ఐ, పురుషోత్తం రెడ్డి ఎస్.ఐ. బాలాజీ ఎస్. ఐ. మరియు ట్రాఫిక్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!