విత్తనాలు కొనుగోలు విషయంలో రైతులకు అవగాహన కార్యక్రమం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని ఖాజిపల్లి, నరసింగాపూర్ గ్రామాలలో శనివారం రోజున రైతులు విత్తనాలు కొనుగోలు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఏఈఓ బి. అరుణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ విత్తనల సంచులు లూజుగా ఉన్నవి కొనరాదని, రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని విత్తన ప్యాకెట్ మరియు బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలని వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ బి .అరుణ్ కుమార్ గౌడ్, బిటిఎం విశ్వనాథ్ మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!