# డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొప్పుల మల్లేశం
ములుగు జిల్లా నేతిధాత్రి
ములుగు జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగులో మేధో సంపత్తి హక్కులు డిజిటల్ యుగంలో పేటెంట్ పాత్ర, ఆవిష్కరణలు సవాళ్లు మరియు పరిష్కారాలు అను అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం విజయవంతమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొప్పుల మల్లేశం పేర్కొన్నారు కళాశాల లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగధిపతి డాక్టర్ బి జగదీష్ అదేవిధంగా ఐక్యుఏసి కన్వీనర్ డాక్టర్ బి బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ నూతన ఆవిష్కరణలను కనుక్కోవడమే కాక దానికి తగిన భద్రతను పొందటానికి పేటెంట్ రిజిస్ట్రేషన్ అవసరమని తెలిపారు ప్రపంచీకరణ నేపథ్యంలో మేదో సంపత్తి హక్కులకు పేటెంట్, కాపీరైట్ వంటి అంశాలకు విస్తృతమైన ప్రాముఖ్యత ఏర్పడిందన్నారు మేధో సంపత్తి హక్కులపై వహించిన ఈ జాతీయస్థాయి అవగాహన సదస్సుకు ప్రముఖ సైంటిస్ట్ మరియు పేటెంట్ ఐపిఆర్ సొల్యూషన్ డైరెక్టర్ డాక్టర్ ముంజం శంకర్ రావు ప్రధాన వక్తగా హాజరై మేదో సంపత్తి హక్కులు పేటెంట్ పొందడం దానిని నమోదు చేసుకునే విధానం మరియు ఈ డిజిటల్ యుగంలో ఎదురయ్యే సవాళ్లు వాటికి గల పరిష్కారాలను అధ్యాపకులకు మరియు విద్యార్థు లకు వివరించడం అయినది ప్రతి ఒక్కరు శాస్త్రీయ దృక్పథంతో నూతన ఆవిష్కరణలను కనుగొనడంపై దృష్టిని సారించి వాటికి పేటెంట్ పొంది భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలిచినప్పుడే మన ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమం కన్వీనర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని కోరారు. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆన్లైన్లో జాతీయస్థాయిలో 200 మంది హాజరు కాగా ఆఫ్లైన్లో వంద మంది హాజరయ్యారని పేర్కొన్నారు కళాశాల ఐక్యూ ఏసీ కన్వీనర్ డాక్టర్ బి బాలయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పేటెంట్ పొందడంలో ఎదురయ్యే సవాళ్లు మరియు పరిష్కారాలు వాటి అంశాలపై పూర్తి అవగాహన ఏర్పడిందని తెలిపారు న్యాక్ కోఆర్డినేటర్ మరియు ఈ కార్యక్రమ ఆర్గనై జింగ్ సెక్రటరీ ఎస్ కవిత ప్రధాన వక్తను పరిచయం చేస్తూ అనేక ఆవిష్కరణలపై పేటెంట్ ఉన్న వ్యక్తి మన కళాశాలకు రావడం అదృష్టమని పేర్కొన్నారు కళాశాల స్టాఫ్ సెక్రెటరీ డాక్టర్ జె సోమన్న మాట్లాడుతూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ అభినం దనలు తెలిపారు కళాశాల వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు బి శిరీష స్వాగత వచనం తెలపగా వృక్షశాస్త్ర అధ్యాపకురాలు ఎస్ సరిత వందన సమర్పణ చేయడమైనది. ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యాపకులు బి బాలయ్య ఎస్ కవిత జె సోమన్న కే సరిత పి నాగమణి బి శిరీష డి రాధిక ఎం అనిల్ కుమార్ పి ఉదయశ్రీ, పి విజిత జే శంకర్ తేజోలత శ్రీను మహమ్మద్ మౌలానా టి అనిత హెచ్ రమేష్, ఎస్ రమేష్ లక్ష్మి షరీఫా తదితరులు పాల్గొన్నారు.