ఓటు హక్కు వినియోగంఫై అవగాహన

*స్వీప్ ఆద్వర్యంలో శిక్షణ

వేములవాడ, నేటిధాత్రి:


రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంఫై ( సిస్టమిక్ ఓటర్ ఎడ్యుకేషన్ మరియు ఎలక్ట్రారల్ పార్టీసిపేషన్ ఆద్వర్యంలో శనివారం శిక్షణ ఇచ్చారు. సిరిసిల్లలోని నర్సింగ్ కళాశాల, వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాల, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి, జిల్లెల్ల లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వోటర్ హెల్ప్ లైన్ యాప్(వి.హెచ్.ఏ) లో అందుబాటులో ఉన్న సేవలు, ఓటు హక్కు నమోదుకు అర్హత వయసు, ఆన్లైన్, ఆఫ్ లైన్ లో ఓటు హక్కు ఎలా నమోదు చేయాలి, ఫారం నెంబర్ 6,7,8 వినియోగం, ఓటు హక్కు నమోదులో తరచూ చేసే తప్పులు ఎలా నివారించాలి తదితర అంశాల ఫై వివరించారు. అనంతరం అధికారులు మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామాలు, పట్టణాల్లో ఓటు హక్కు వినియోగించు కునేలా విద్యార్థులు అవగాహన కల్పించాలని కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *