
heavy rains
-సీజన్ వ్యాధుల పట్ల అవగాహన.
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మేదరమట్ల గ్రామంలో మొగుళ్ళపల్లి వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో డాక్టర్ వాణి (MLHP)ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ గారు మాట్లాడుతూ వర్షాలు అధికంగా ఉండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , లేనిచోఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున, వర్షంలో ఎక్కువగా తిరగకూడదని ,అదేవిధంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలని ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేనిచో సీజన్ వ్యాధులు మలేరియా డెంగ్యూ ,చికెన్ గున్యా, డయేరియా లాంటి వ్యాధులు ప్రజలు అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బందికి తెలియజేయాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఈ యొక్క మేదరమట్లవైద్య శిబిరంలో 66 మంది కి వైద్య పరీక్షలు చేసి రెండు జ్వర పీడితులను గుర్తించి రక్త నమూనాను తీసి ల్యాబ్ పంపినారు. అలాగే గ్రామంలో దోమలు లార్వా రాకుండా తిమోఫాస్ దోమల మందను పిచ్చికారి చేయడం అయినది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంషబీద, పంచాయతీ సెక్రెటరీ, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది ,ప్రజలు పాల్గొన్న .