కోటపల్లి, (చెన్నూర్) నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామంలో గురువారం అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ గురించి స్థానికులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్బంగా మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ అటవీ, ప్లాంటేషన్ ప్రాంతాల మీదుగా ఎవరైనా వెళ్ళేటప్పుడు బీడీలు, సిగరెట్ లు తాగి పడేయవద్దని చెప్పారు. అటవీ ప్రాంతం లో ఎటువంటి కారణం చేతనైనా సరే ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే మాకు సమాచారం ఇచ్చి, ఆ మంటలు అర్పివేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఈ సమయం లో అడవులు, ప్లాంటేషన్ లలో నిప్పు అంటుకుంటే చాలా నష్టం జరుగుతుందని, దీంతో పర్యావరణం పై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.అందువల్ల అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సామాజిక భాద్యత గా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో అటవీ అభివృద్ధి సంస్థ(టి.ఎస్.ఎఫ్.డి. సి )మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ తో పాటు ఫీల్డ్ సూపర్ వైజర్ శ్రీనివాస్, వాచర్ ఓదెలు లు పాల్గొన్నారు.