నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిలావరంగల్ గ్రౌండ్ వద్ద ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా ఆడేపు ఓవర్సీస్ కన్సల్టెన్సీ సీఈఓ ఆడేపు మధుసుధన్ అధ్వర్యంలో క్యాన్సర్ అవగాహణ సదస్సు నిర్వహనలో భాగంగా 2కే రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆడేపు మధుసుధన్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. క్యాన్సర్ భారిన పడకుండా ఉండాలంటే రోజూ ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోవాలని, ప్రతి రోజూ ఓక అరగంట పాటు మెడిటేషన్, యోగ తప్పకుండా చేయడం అలవరుచుకోవాలి అని అన్నారు. ప్రతి రోజూ సుచి, శుభ్రతతో కూడిన ఆహారం తినాలి అన్నారు. అనంతరం 2కే రన్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.