
Mogullapalli SI Warns Farmers on Cybercrime
సైబర్ నేరాల గురించి అవగాహన
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగులపల్లి మండలంలోని వేములపల్లి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి మండల రైతులకు మొగుళ్ళపల్లి ఎస్ ఐ బి అశోక్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమం సిబ్బందితో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ గురించి మరియు ఏ విధంగా సైబర్ నేరస్తులు ఫేక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకొని అమాయకులకు కాల్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నాము అని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. ఎవరికైనా ఇలా సైబర్ నేరస్తులు కాల్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నాము అంటే నమ్మకండి వెంటనే 1930 నెంబర్ కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి మరియు ముఖ్యంగా మీ యొక్క బ్యాంకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వివరాలు మరియు బ్యాంకు సంబంధించిన ఓటీపీలు ముఖ్యంగా రైతుబంధు రైతు బీమా రైతు భరోసా వంటి పథకాలకు సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకండి. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటూ వచ్చే అపరిచిత కాల్స్ ను నమ్మి మోసపోవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచన ఇచ్చారు