చందుర్తి, నేటిధాత్రి:
తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చందుర్తి మండలం మల్యాల గ్రామ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ చాటిన విద్యార్థిని ,విద్యార్థులను స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన శ్రీధర్ల శ్రీజ,(9.5), అల్లం మనోజ్ఞ (9.2), శ్రీధర్ల లహరి (9.2) బుర్రి కావ్య (9.0 ), తుమ్మ సృజన్ (9.0)శాలువాతో సన్మానం చేసి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాలను, స్వీట్స్ అందించారు . ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులు అభినందిస్తూ విద్యార్థులు ఉన్నత చదువుల్లో మరింత ప్రతిభ రాణించి జీవితంలో లక్ష్యాలను సాధించి స్థిరపడాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు బొడ్డు కృష్ణ, లోకోజు సతీష్ కుమార్, పత్తిపాక శ్రీనివాస్, దురిశెట్టి రాజు, లింగంపల్లి మధుసూదన్, గొల్లపల్లి సాయికృష్ణ, పంచెర్పుల దివ్యసాగర్, మోత్కుపల్లి మధు యాదవ్, తోట శంకర్, యువకులు అల్లం నవీన్, తోట సురేష్ ,మోత్కుపల్లి గణేష్, అర్షం అజయ్, గూడూరు రవి, విద్యార్థుల తల్లిదండ్రులు రమేష్, తిరుపతి ,మల్లేశం పాల్గొన్నారు