Auto Drivers Perform Milk Abhishekam for KTR
ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో కేటీ రామారావుచిత్రపటానికి పాలాభిషేకం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీ రామారావు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ అధ్యక్షులు జిల్లా యూనియన్ గౌరవ అధ్యక్షులు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొ ల్లి రామ్మోహన్ పాల్గొని మాట్లాడుతూ. గత ప్రభుత్వం ఆయాంలో .ఆటో డ్రైవర్లుఅందరూ పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో జీవనం సాగించారని. ఇప్పుడున్న సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆటో డ్రైవర్ లు జీవనోపాధి మీద చాలా భారం పడిందని. మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న సంవత్సరానికి. మీ మాట ప్రకారం అటు డ్రైవర్లఅకౌంట్లో డబ్బులు వేస్తామని ఆటో డ్రైవర్లకు మాయమాటలు చెప్పి తప్పించుకుని తిరుగుతున్నారని పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తున్నారని. అందుకు అనుగుణంగా వెంటనే ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పై .దయ తలచి మీరు ఇచ్చిన మాట ప్రకారం వారి అకౌంట్లో డబ్బులు వేయాలని. ప్రభుత్వపరంగా జీవిత బీమా 10 లక్షలకు విధంగా వారికి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎందరో నిరుపేద కార్మికులు ఆటో డ్రైవర్ గా జీవిస్తున్నారని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారి బాగోబాగులు. చూసుకోవాలని. అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పించడం మంచిదే అయిన దానికి వ్యతిరేకం మేము కాదు అని. దీనివలన ఆటో జీవన ఉపాధి పై. భారం పడుతుందని దయచేసి ప్రభుత్వాలు దీనిపై ఆలోచన చేసి వారి జీవితాలలో వెలుగు నింపాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి పాలాభిషేక. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీసీ సంక్షేమ శాఖ నాయకులు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్. నులిగొండ శ్రీనివాస్. ఆటో యూనియన్ అధ్యక్షులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు
