
Collector Adarsh Surabi
ముఖ్యమంత్రి ప్రజావాణిలో వచ్చే ప్రజల ఫిర్యాదులు అధికారులు పరిష్కరించాలి
కలెక్టర్ ఆదర్శ్ సురబి అధికారులకు ఆదేశాలు
వనపర్తి నేటిదాత్రి .
ముఖ్యమంత్రి ప్రజా భవన్ లో ప్రజల నుండి వచ్చే వనపర్తి జిల్లా ప్రజల ఫిర్యాదులను వనపర్తి అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రజావావాణి లో స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు వెంటనే సమాచారం అందించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, ప్రతి సోమవారం జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.