పారిశుధ్యం పై అధికారులు దృష్టి పెట్టాలి

•మధ్యాహ్న భోజనం పరిశీలన
•డిపీఓ యాదయ్య

నిజాంపేట: నేటి ధాత్రి

“స్వచ్ఛత హే సేవ” కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధం ప్రబలకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అన్నారు.. ఈ మేరకు మంగళవారం నిజాంపేట మండలం లో ఆయన పర్యటించి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం పై సంబంధిత మండల విద్యాధికారికి చరవాణి ద్వారా సంబోధించారు. అనంతరం మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో పాల్గొన్నారు . ప్రైమరీ స్కూల్ పిల్లలు తడి చెత్త పొడి చెత్త గురించి విన్యాసాలు చేశారు అలాగే ప్రకృతి గురించి విన్యాసాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి రాజిరెడ్డి, ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ హేమలత, పంచాయతీ కార్యదర్శి మమత, ఉపాధ్యాయులు మన్మధ, రజిని, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *