పైడిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం..!

Dalit Rights Struggle Dalit Rights Struggle

పైడిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం..!

నగరంలో బండి కుమారస్వామి కబ్జా విషయం ఇంకా కనుమరుగక ముందే, ఎల్లవుల కుమార్ యాదవ్ కబ్జాకు ప్రయత్నం?

ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్న ఎల్లావుల కుమార్ యాదవ్ పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి :_ సంఘీ ఎలేందర్, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు.

పైడిపల్లి, నేటిధాత్రి.

 

 

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పైడిపల్లి గ్రామ శివారు సర్వే నెంబరు 264లో ఎల్లావుల కుమార్ యాదవ్ ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసుకొని, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సంఘీ ఎలేందర్, జన్ను రవి లు అట్టి ప్రభుత్వ భూమిని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ఎల్లవుల కుమార్ యాదవ్ సర్వేనెంబర్ 263లో రిజిస్ట్రేషన్ చూపించి సర్వే నంబర్ 264 భూములను అమ్మినాడని, ఇట్టి విషయంపై గత కొన్ని ఏళ్లుగా పోరాటం చేయుచుండగా, వరంగల్ తహశీల్దార్ ఇట్టి భూమిలో, ఇది ప్రభుత్వ భూమి ఎవరు అక్రమించరాదని బోర్డు పెట్టడం జరిగినది అని, అయినా కానీ తన వైఖరి మార్చుకోకుండా కొందరి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి, అక్కడున్న గుడిసె వాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కావున ఎల్లవుల కుమార్ యాదవ్ పై నమోదైన కేసుల సంఖ్యలు పరిశీలించి వరంగల్ పోలీస్ కమిషనర్ అతడిపై రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని కోరడమైనది. నగరంలో బండి కుమారస్వామి కబ్జా విషయం ఇంకా కనుమరుగక ముందే ఎల్లవుల కుమార్ యాదవ్ కబ్జాకు ప్రయత్నం చేయడం వరంగల్ జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా మారిందని భూకబ్జాదారులను వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ కట్టడి చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో
సిపిఐ నాయకులు ఆరే రాజు, మాస్కే సుదీర్, బెజ్జంకి యాకంబ్రచారి, రాచర్ల రాజేందర్, మంద నవీన్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!