పహాల్గమ్ లో పర్యాటకుల పై జరిగిన దాడి.!

Lawyers Lawyers

పహాల్గమ్ లో పర్యాటకుల పై జరిగిన దాడిని నిరసిస్తూ విధులను బహిష్కరించిన న్యాయవాదులు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

 

గురువారం రోజున హన్మకొండ మరియు వరంగల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో కాశ్మీర్ లోని పహాల్గమ్ లో మంగళవారం యాత్రికుల పై ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ కోర్టు విధులను బహిష్కరించి కోర్టు గేట్ ముందు బైఠాయించారు. ఆతర్వాత న్యాయవాదులు ర్యాలీ గా వెళ్లి తీవ్ర వాదుల మారణహోమాన్ని నిరసిస్తూ వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల కలెక్టర్లకు భారత ప్రభుత్వానికి మరియు ఆర్మీకి మద్దతుగా లేఖలు ఇవ్వడం జరిగింది.

 

Lawyers
Lawyers

తీవ్ర వాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు న్యాయవాదులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో హన్మకొండ/వరంగల్ బార్ అసోసియేషన్ ల అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుదీర్ మరియు ఇరు బార్ అసోసియేషన్ ల ప్రధాన కార్యదర్శులు రవి, రమాకాంత్, ఇరు బార్ అసోసియేషన్ల కమిటీ సభ్యులు, సీనియర్, జూనియర్  న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!