పాత కక్షలతో దంపతులపై దాడి

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు

ముత్తారం :- నేటి ధాత్రి

పాత కక్షలు దృష్టిలో ఉంచుకొని దంపతులపై దాడి చేసిన సంఘటన ముత్తారం మండలంలోని లక్కారం గ్రామంలో చోటుచేసుకుంది బాధితురాలు దోరి మంజుల జరిగిన సంఘటనపై ముత్తారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఫిర్యాదులో తెలిపిన ప్రకారం దోరి శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి లక్కవరం లో నివసిస్తున్నాడు 16వ తేదీ సాయంత్రం ఫిర్యాదుదారు మంజుల ఇంటి ముందు నిలబడి ఉండగా అదే గ్రామానికి చెందిన సమీప బంధువు వీరగోని రాజేశం కుటుంబ సభ్యులు శ్రీనివాస్ మంజుల దంపతులపై పాత కక్షలు మనసులో ఉంచుకొని బూతులు తిడుతూ విచక్షణ రహితంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు దాడిలో భర్త శ్రీనివాస్ తో పాటు మంజులకు తీవ్ర గాయలైనట్టు తెలిపారు దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు మంజుల ముత్తారం పోలీస్ స్టేషన్లో బుధవారం రోజున ఫిర్యాదు చేశారు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *