హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దాడి.

Tirupati Nayak Tirupati Nayak

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దాడిని ఖండిస్తూ భూమి అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలి లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదు- తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

లంబాడా జేఏసీ చైర్మన్ భూక్య తిరుపతి నాయక్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మీరు వేలం వేస్తున్నది హెచ్సియూ భూములను కాదు, హైదరాబాద్ ఊపిరితిత్తులను. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సియూకి 2300 ఎకరాల భూమిని ఇస్తే, నేడు అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆభూములను అమ్మడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాలన చేతకాక, పన్నులు రాబట్టక, భూములను అమ్మి జీతాలు ఇవ్వాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి “ప్రభుత్వ భూమి ఒక గుంట కూడా అమ్మకుండా చూస్తాం” అని చెప్పి, నేడు యూనివర్సిటీ భూములు ఎలా అమ్ముతున్నాడు. ఉద్యోగాలు భర్తీ చేయడం, పథకాలు ప్రజలకు అందించడం చేతగాక, ఈరోజు భూములను కాపాడాలని నిరసన తెలియజేసిన విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి రాష్ట్రంలో ఒక నిర్బంధకాండ కొనసాగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోతే రెండుసార్లు వచ్చిన రాహుల్ గాంధీ, ఈరోజు విద్యార్థులపై దాడి జరుగుతుంటే కనీసం స్పందించడం లేదేందుకో ప్రజాస్వామ్య వాదులారా, పర్యావరణ రక్షకులారా ఈరోజు యూనివర్సిటీ భూములను కాపాడడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భూముల వేలం ప్రక్రియను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యార్థుల మీద పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని బంజారా జేఏసీ చైర్మన్ భూక్యా తిరుపతి నాయక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!